Skip to main content

Huzurabad bypoll: ఈటల రాజేందర్ వర్సెస్ హరీశ్ రావుగా మారిన సీన్

 


హైదరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నిక తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ వేడిని పెంచుతోంది. ఈ ఉపఎన్నికలో తాను తిరిగి విజయం సాధించి పట్టు నిలుపుకోవాలని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అవిశ్రాంతిగా శ్రమిస్తుండగా.. ఎలాగైనా హుజూరాబాద్ అసెంబ్లీ స్థానంలో గెలవాలని అధికార టీఆర్ఎస్ కూడా అన్ని ప్రయత్నాలను చేస్తోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు హరీశ్ రావు రంగంలోకి దిగడంతో ఈటల వర్సెస్ హరీశ్ అన్నట్లుగా సీన్ మారిపోయింది.