తెలంగాణలో నిరుద్యోగుల చావులు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరో నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసి చూసి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ఉద్యోగం లేకపోవడం,ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతుండటంతో ఆ యువకుడు మానసికంగా కుమిలిపోయాడు. చివరకు రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఈ ఘటన చోటు చేసుకుంది. హుజురాబాద్ ఉపఎన్నిక వేళ నియోజకవర్గంలో నిరుద్యోగి ఆత్మహత్యపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది.
తెలంగాణలో నిరుద్యోగుల చావులు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరో నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసి చూసి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ఉద్యోగం లేకపోవడం,ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతుండటంతో ఆ యువకుడు మానసికంగా కుమిలిపోయాడు. చివరకు రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఈ ఘటన చోటు చేసుకుంది. హుజురాబాద్ ఉపఎన్నిక వేళ నియోజకవర్గంలో నిరుద్యోగి ఆత్మహత్యపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది.