Skip to main content

తీన్మార్ మల్లన్నపై సీసీఎస్ పోలీసుల కేసు

 


తెలంగాణలో అధికార టీఆర్ఎస్ ను తీవ్రంగా ప్రశ్నిస్తోన్న ప్రముఖ జర్నలిస్ట్ తీర్మార్ మల్లన్నఅలియాస్‌ చింతపండు నవీన్‌కుమార్‌పై హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. తీన్మార్‌ మల్లన్న నేతృత్వంలో నడుస్తున్న క్యూ న్యూస్‌ చానల్‌లో తన వ్యక్తిగత ఫొటోలను చూపించి పరువుకు భంగం కల్గించారంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.