Skip to main content
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం.. : మంత్రి కేటీఆర్
తెలంగాణలో 60 లక్షల పైచిలుకు కుటుంబ సభ్యులు కలిగి అజేయమైన శక్తిగా టీఆర్ఎస్ పార్టీ ఎదిగిందని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటామని వివరించారు. పార్టీ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రమాదాల్లో దుర్మరణం చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలకు కేటీఆర్ బీమా సాయం అందించారు. తెలంగాణ భవన్లో 80 మంది నాయకులు, కార్యకర్తల కుటుంబాలకు రూ. 2 లక్షల బీమా సాయం అందించి, వారిలో మనో ధైర్యాన్ని నింపారు. ఆ కుటుంబాలతో కలిసి కేటీఆర్ భోజనం చేశారు.