మాదాపూర్లో గల హోటల్లో జంట మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. రాములు, సంతోషి మృతికి సంబంధించి కచ్చితమైన ఆధారం ఏమీ దొరకలేదు. చెల్లి సంతోషికి ఇద్దరినైనా ఎదిరించే శక్తి ఉందని, పిరికిది కాదని సంతోషి అన్నయ్యలు అంటుండగా.. తన కుమారుడు ఆత్మహత్య చేసుకునే ధైర్యం చేయడని, గొంతుకోసుకొని ఉరేసుకునే అవకాశమే లేదని రాములు పేరంట్స్ అంటున్నారు.బ్లేడ్తో గొంతుకోసుకున్న తర్వాత చున్నీతో రాములు ఫ్యాన్కు ఉరేసుకున్నాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.