Skip to main content

రైతులకు అలర్ట్... దరఖాస్తుకు చివరి గడువు ఎప్పుడంటే...

 


తెలంగాణలో అర్హులైన రైతులు 'రైతు భీమా' పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 11వ తేదీ వరకు ప్రభుత్వం గడువు ప్రకటించింది. ఈ ఏడాది అగస్టు 3వ తేదీ లోపు భూములను రిజిస్టర్ చేయించుకున్న రైతులు... 11వ తేదీ లోపు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని సూచించింది. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు రూ.5లక్షలు భీమా ఉంటుంది. ప్రమాదవశాత్తు లేదా అనారోగ్యం కారణంగా రైతు మరణిస్తే ఆ మొత్తం నామినీకి అందజేస్తారు.కాబట్టి అర్హులైన రైతులంతా దీనిని సద్వినియోగం చేసుకోవాలని వ్యావసాయ శాఖ అధికారులు కోరారు.