ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వాతావరణ మార్పుల ప్రభావం వివిధ దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న నగరాలపై వీటి ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఇందుకు తాజా ఉదాహరణ అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్ధ నాసాకు చెందిన అంతర్ ప్రభుత్వాల ప్యానెల్ ఇచ్చిన తాజా రిపోర్ట్. ఇందులో భారత్ లోని 12 తీర ప్రాంత నగరాలు వాతావరణ మార్పుల కారణంగా ఈ శతాబ్ధం అంతమయ్యే లోపు 3 అడుగుల మేర సముద్రంలో మునిగిపోతాయని తేలింది.
