Skip to main content

కేసీఆర్ సోయి ఉండటం లేదా..? రాములమ్మ విజయశాంతి నిప్పులు


సీఎం కేసీఆర్‌పై రాములమ్మ విజయశాంతి మరోసారి ఫైరయ్యారు. ఉద్యమంలో అమరులైన కుటుంబాలను కలవడానికి 7 సంవత్సరాలుగా సీఎంకు సమయం దొరకలేదా అని అడిగారు. ఆత్మహత్యలు చేసుకున్న వేలాది రైతుల, నిరుద్యోగుల కుటుంబాలను చూడడానికి ఒక్క రోజుకూడా దొరకదని మండిపడ్డారు. ఏవో రెండు మూడు గ్రామాలను దత్తత తీసుకున్నానని చెబుతూ నెలకు రెండు సార్లు వెళ్ళిన చోటికే మళ్లీ మళ్లీ పర్యటనలు చేస్తూ, ఆ ఊర్లకే మొత్తం అధికార యంత్రాంగం ఉరుకులు, పరుగులు పెడుతున్నారని అన్నారు.