Skip to main content

హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి దాదాపుగా ఖరారు...?

 


 హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి అన్వేషణలో తీవ్ర తర్జనభర్జన పడుతున్న గులాబీ బాస్ కేసీఆర్ ఎట్టకేలకు ఒక పేరును ఫైనల్ చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును సీఎం కేసీఆర్ దాదాపుగా ఖరారు చేశారని ప్రచారం జరుగుతోంది. కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలకు దీనిపై ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు. దళిత బంధు పథకం ప్రారంభించేందుకు ఈ నెల 16న హుజురాబాద్‌లో పర్యటించనున్న కేసీఆర్... అదే రోజు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను ఉపఎన్నిక అభ్యర్థిగా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది.