ఎనిమిది ఇతర రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఆగస్టు 2 తో ముగిసిన వారంలో కేసుల పెరుగుదలను నివేదించాయని కేంద్రం తాజా గణాంకాల ద్వారా స్పష్టం చేసింది. కేరళ విషయానికొస్తే, తాజా సగటు వారపు పెరుగుదల 17 శాతానికి పైగా ఉంది. ప్రతిరోజూ దాదాపు 20,000 కేసులు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కోవిడ్ -19 కేసులు బాగా పెరుగుతున్న నేపథ్యంలో, గత వారం కేరళలో పర్యటించిన ఆరుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం ఫలితాలను కేంద్ర ప్రభుత్వం మంగళవారం అప్డేట్ చేసింది.