Skip to main content

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లకు ఆ బాధ్యతలు అప్పగించిన రేవంత్ రెడ్డి...

 


తాజా మార్గదర్శకాల ప్రకారం... కాంగ్రెస్ సీనియర్ నేత గీతా రెడ్డికి సికింద్రాబాద్,నల్గొండ,హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ కార్యకలాపాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. అలాగే ఎన్‌ఎస్‌యూఐ,ఇంటలెక్చువల్ సెల్,రీసెర్చ్ డిపార్ట్‌మెంట్,ప్రొఫెషనల్ కాంగ్రెస్ పర్యవేక్షణ బాధ్యతలు ఆమెకు అప్పగించారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‌కు నిజామాబాద్,మహబూబాబాద్,మెదక్,పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. అలాగే యూత్ కాంగ్రెస్,మైనారిటీ డిపార్ట్‌మెంట్,ఫిషర్‌మెన్ డిపార్ట్‌మెంట్ వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు.