Skip to main content

మంత్రులపై జగన్ సీరియస్-ముగ్గురికి వార్నిం


ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండున్నరేళ్లు కావస్తోంది. అంటే దాదాపు సగం పదవీకాలం పూర్తయిపోయింది. ఇంకా కేబినెట్ మంత్రుల్లో చాలా మంది కుదురుకోనట్లే కనిపిస్తోంది. సీఎం జగన్ గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు వీరిలో చాలా మంది త్వరలో ఇంటిముఖం పట్టబోతున్నారు కూడా. ఇలాంటి సమయంలో తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో మంత్రుల పనితీరుపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కీలకమైన అంశాలతో పాటు విపక్షాల విమర్శలపైనా మంత్రులు సరిగ్గా స్పందించడం లేదని ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. దీంతో పాటు మంత్రులకు కీలక సూచనలు చేశారు.