దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తోన్న అద్భుత ఘట్టానికి ముహుర్తం దాదాపు ఖరారైంది. తన జన్మభూమి నుంచే శ్రీరాముడు జనానికి దర్శనమిచ్చే సమయం ఇంకెంత దూరంలోనూ లేదు.. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ప్రధాని నరేంద్ర మోదీ శిలాన్యాస్ చేసి నేటి(ఆగస్టు 5)కి ఏడాది పూర్తవుతోన్న సందర్భంగా రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక విషయాన్ని వెల్లడించింది. భూమి పూజ చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా పలు కార్యక్రమాలను నిర్వహించేందుకు ట్రస్ట్ సిద్దమవుతోంది.