తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేయబోతున్న దళిత బంధు పథకానికి మార్గదర్శకాలు విడుదలయ్యాయి. పథకం అమలుకు జిల్లా,మండలం,గ్రామ స్థాయిల్లో కమిటీలను నియమించనున్నట్లు తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. పథకం అమలు ప్రక్రియ మొత్తం కమిటీల పర్యవేక్షణలోనే జరగనుంది. పథకంపై అమలుపై అవగాహన సదస్సుల నిర్వహణ,డేటా బేస్లో అర్హులైన దళిత కుటుంబాల రిజిస్ట్రేషన్లు,కలెక్టర్ జారీ చేసే నిధుల మంజూరు పత్రాలను పంపిణీ చేయడం తదితర పనులన్నీ కమిటీలే నిర్వర్తించనున్నాయి.
| Share on Whatsapp |