తిరువనంతపురం: ప్రాణాంతక కరోనా వైరస్ థర్డ్ వేవ్ తీవ్రత ఆరంభమైన పరిస్థితులు కనిపిస్తోన్నాయి. సెకెండ్ వేవ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్న సమయంలో- వేల సంఖ్యలో నమోదైన కొత్త కేసులు పునరావృతం కానున్నాయనే సంకేతాలు అందుతోన్నాయి. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ- ఒకట్రెండు రాష్ట్రాల్లో ఆ మహమ్మారి ఇంకా విజృంభిస్తూనే ఉందనడానికి సాక్ష్యంగా నిలిచింది.. కేరళ. సెకెండ్ వేవ్ తీవ్రత ఏపీ సహా దాదాపు అన్ని రాష్ట్రాల్లో నియంత్రణలోనే ఉన్నా.