Skip to main content

మహాదేవపూర్ మండల కేంద్రంలో స్తంభించిన రవాణా వ్యవస్థ__

 

మహాదేవపూర్ మండల కేంద్రంలోని 353 జాతీయ రహదారిపై ఆదివారం ఇసుక లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో కాళేశ్వరం, వరంగల్, చత్తీస్గఢ్, భూపాలపల్లి తదితర ప్రాంతాలకు వెళ్ళవలసిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇసుక లారీలు ఇష్టారీతిగా నిలపడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారిందని పోలీస్ రవాణా శాఖ అధికారులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికుల రవాణాకు సహకరించాలని స్థానికులు కోరారు...